కవాడిగూడ : 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలందరూ తప్పని సరిగా కొవిడ్ టీకాను వేయించుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ యూపీహెచ్సీలో 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ టీకాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొన్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా టీకా వేయించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భోలక్పూర్ టీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్, శివ ముదిరాజ్, జబ్బర్, ప్రవీణ్ కుమార్, ఆర్. శ్రీనివాస్, ముచ్చకుర్తి ప్రభాకర్, డాక్టర్ కృష్ణమోహన్ రావు, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.