HomeHyderabadMahakala Rudrabhishekam To Perform At Jonnabanda Shivalayam On Monday
మాసశివరాత్రి సందర్భంగా రేపు జొన్నబండ శివాలయంలో మహాకాల రుద్రాభిషేకం
హైదరాబాద్ : ఓల్డ్ అల్వాల్లోని శివనగర్లో ఉన్న ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకొని శివుడికి మహాకాల రుద్రాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఏకబిల్వ, అఖండ బిల్వ, సహిత లక్ష పుష్పాభిషేకం జరుగుతుందని ఆలయ చైర్మన్ కొడారి నర్సింగరావు, ఆలయ ప్రధాన అర్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ తెలిపారు.
అభిషేకంలో పాల్గొనాలనుకునే భక్తులు గోత్రనామాలతో పాటు రూ.101 చెల్లించాలని భక్తులకు సూచించారు. స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చనలో భాగంగా వాడే పుష్పాల కోసం రూ.501 సమర్పించాలని తెలిపారు. భక్తులు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి, శివానుగ్రహం పొందాలని పేర్కొన్నారు.