జూబ్లీహిల్స్ జోన్ బృందం : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం ఆలయాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి.ఉదయమే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిటకిటలాడాయి.
వెంగళరావునగర్లోని జీటీఎస్ ఆలయంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రహ్మత్నగర్ ఎస్పీఆర్ హిల్స్లోని గోరక్నాథ్ ఆలయంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, యూసుఫ్గూడలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.