హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని సీఎం కేసీఆర్ డ్రగ్స్ మాఫియాపై వార్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు పోలీస్ ఉన్నతాధికారులతో డ్రగ్స్ను ఎలా రాష్ట్రం నుంచి మొగ్గలోనే తుంచేయాలో చర్చించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో డ్రగ్స్ నియంత్రణపై మాదాపూర్ జోన్ పోలీసు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించారు.