బంజారాహిల్స్, జనవరి 12: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న సినీ నటుడు బాలకృష్ణకు ‘ ఎల్వీ ప్రసాద్-ఆకృతి’ పురస్కారాన్ని జనవరి 17న ప్రదానం చేయనున్నట్లు ఆకృతి సంస్థ అధినేత సుధాకర్ తెలిపారు.
అవార్డుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను గురువారం ప్రసాద్ గ్రూప్స్ సంస్థ అధినేత రమేశ్ ప్రసాద్తో కలిసి నందమూరి బాలకృష్ణకు అందజేశారు.