136 ఆటోలతో పారిశుధ్య నిర్వహణ
పకడ్బందీగా తడి-పొడి చెత్త సేకరణ
జూబ్లీహిల్స్,మార్చి27: స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా అడుగులు వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇకపై చెత్త సేకరణను మరింత ప్రణాళికా బద్ధంగా చేపట్టనున్నారు. చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య ప్రమాణాలు పెంచేందుకు ఇటీవల స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన అధికారులు చెత్త సేకరణను లాగ్బుక్ల్లో నమోదు చేయనున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో చెత్త సేకరణను వేగవంతం చేసేందుకు 80 పాత ఆటోలతో పాటు కొత్తగా 56 స్వచ్ఛ ఆటోలతో సేవలందిస్తున్నారు. కాగా సర్కిల్లో 136 స్వచ్ఛ ఆటోలతో పారిశుధ్య నిర్వహణను చేపడుతున్న అధికారులు ఇకపై లాగ్బుక్స్తో ఆయా పనులను పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న స్వచ్ఛ ఆటోల సిబ్బంది సంబంధిత ఇంటి యజమాని పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్తో పాటు చెత్త సేకరించిన తేదీని అందులో నమోదు చేయనున్నారు.
వివరాలు నమోదు చేయాలి
యూసుఫ్గూడ సర్కిల్కు చెత్త సేకరణను నమోదు చేసేందుకు ఆటోల వారీగా లాగ్బుక్లు అందజేస్తున్నాం. వార్డుల వారీగా కేటాయించిన వాహనాల్లో వన్టైమ్ డేటా సేకరిస్తున్నాం. సర్కిల్లోని యూసుఫ్గూడ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ, రహ్మత్నగర్, బోరబండ డివిజన్లలో తడి-పొడి చెత్త సేకరిస్తున్న ఆటోలు విధిగా లాగ్బుక్లలో వివరాలు నమోదు చేయాలి. ఇందులో భాగంగా అన్ని ఆటోలకు లాగ్బుక్లు అందజేస్తున్నాం.
–ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి, యూసుఫ్గూడ