సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : లోన్యాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన ఖాతాలను సైబర్నేరగాళ్లతో కలిసి కోల్కతా ఐసీఐసీఐ బ్యాంకులో డీఫ్రీజ్ చేసిన మేనేజర్ రాకేశ్కుమార్ దాస్ను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కోల్కతా సైబర్క్రైమ్ పోలీసులమంటూ నకిలీ లేఖలు సృష్టించి వాటిని బ్యాంకులో అందించడంతో రాకేశ్కుమార్ రూ. 1.8 కోట్లు ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన నల్లమోతు అనిల్కుమార్, ఆనంద్జన్నులను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్కుమార్ పోలీసుగా బ్యాంకులో నటించగా, రాకేశ్కుమార్ ఖాతాలు డిఫ్రీజ్ చేశాడు. కేసులో ప్రధాన సూత్రధారి ఉత్తమ్ చౌదరితో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు.