చర్లపల్లి, ఫిబ్రవరి 8 : ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామ ని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తా, తదితర ప్రాంతాల్లో ఆయన ..ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డితో కలిసి పర్యటించి ట్రాఫిక్ సమస్యలు, ప్రధాన కూడళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంలో ఈసీఐఎల్ చౌరస్తా, రాధిక చౌరస్తా ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్ సమస్యలకు కా రణమవుతున్న వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, సిగ్నల్స్ వద్ద ఫుట్పాత్లను ఆక్రమించడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐలు ప్రకాశ్, శ్రీనివాస్రెడ్డిలతో పాటు కుషాయిగూడ ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.