కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 14 : గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మల్కాజిగిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురవేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కేపీహెచ్బీకాలనీ 9వ ఫేజ్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోరుతూ కేపీహెచ్బీ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు అభివృద్ధి, మరోవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందించారని కొనియాడారు.
గత పదేండ్లలో కూకట్పల్లి నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి భారీ మెజార్టీని అందించాలని కోరారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సురేశ్రెడ్డి, నాగేశ్వర్రావు, నరసింగరావు, పీ. గోపి, రాజేశ్రాయ్, సాయిశ్రీనివాస్, జీఎల్ఎన్ రెడ్డి, భారతి, భవానీ, రమాదేవి, లత, పద్మారెడ్డి, పద్మ, కుమారి, అనూరాధ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.