ఉప్పల్, మే 11 : అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని పలు ప్రాంతాల్లో రూ.93 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలోని ప్రతి కాలనీ ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. కాలనీల్లో మౌలికవసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తిచేయడం ద్వారా సావర్కర్నగర్, బాబానగర్, రాఘవేంద్రనగర్, హనుమాన్నగర్ ప్రాంతా ల్లో సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. ప్రజ ల కోసం పనిచేసేవారికి ప్రజాదరణ ఎప్పటికీ ఉంటుందన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, పనులు చేపడుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు, ప్రజలకు కష్టాలు లేకుండా నూతన పథకాలను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ లింగారావు, వర్క్ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, సాయిజెన్ శేఖర్, గరిక సుధాకర్, మే కల ముత్యంరెడ్డి, తిరుపతి, దాసరి కర్ణ, శ్రీరామ్ సత్యనారాయణ, యాదగిరి, విఠల్యాదవ్, తుంగ తిరుపతి, కట్ట బుచ్చన్న, శ్రీనివాస్, కిట్టు, అనిల్, అశోక్, కామేశ్వరీ, బాలమణి, షాహిన్బేగం, సంతోష్, భాస్కర్, మంగోల్ శివకుమార్, రాంచందర్, మల్లేశ్ , తదితరులు పాల్గొన్నారు.