హయత్నగర్, అక్టోబర్ 20 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని 24వ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, హయత్నగర్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ పి.చందన సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం హయత్నగర్ కోర్టు ఆవరణలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. పేదలకు ఉచితంగా న్యాయ సేవలను అందించేలా కోర్టు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు వచ్చే నెల 14 వరకు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ, రామ్మోహన్, మహాత్మ, భార్గవి, ప్రవీణ్, కోటేశ్వరరెడ్డి, వేణుగోపాల్, సురేందర్రెడ్డి, వంశీ కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.