ఖైరతాబాద్, మార్చి 31 : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నేతలు, కార్యకర్తలు ఆత్మీయత పంచుకున్నారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై పరస్పరం అభిప్రాయాలు వెల్లడించారు. సోమాజిగూడలోని జయగార్డెన్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ డివిజన్ ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ కె. విప్లవ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్నరామ్మూర్తి, బీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, మహేందర్ బాబు, కేవీ ప్రసాద్, తాండ్ర మేఘన, కర్నాటి నాగేశ్వర్ రావు, శ్యామ్, మహేశ్ యాదవ్, త్యాగరాజు, బోనగిరి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జకీర్, రాంరెడ్డి, తేజా చౌదరి, పులి సంతోష్ కుమార్, లక్ష్మణ్ యాదవ్, పాషా, రుక్మిణి, రమాదేవి, లక్ష్మి, వెంకట్, రాజ్ కుమార్, సోమాజిగూడ డివిజన్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, కె. రామూర్తి, పి. నాగరాజు, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.