సిటీబ్యూరో, జులై 6 (నమస్తే తెలంగాణ): మారణాయుధాలు కలిగి ఉన్న పాత నేరస్తుడు, అతడికి సహకరిస్తున్న బాల నేరస్తుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఫవాద్ ఖురేషి ఆటోడ్రైవర్. గతేడాది రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు.
ఆటోలో బాలుడిని తన అనుచరుడిగా వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. రెండు డ్యాగర్లు తన ద్విచక్రవాహనంలో పెట్టుకొని ఇద్దరు కలిసి షాహిన్నగర్, బాలాపూర్ ప్రాంతాల్లో తిరుగుతుండగా, ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం పట్టుకుంది. ఇద్దరిని అరెస్టు చేసి.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.