ఎల్బీనగర్, నవంబర్ 14 : తెలంగాణలో ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని, ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్లోని బంజారాకాలనీ, పరిసర కాలనీల నుంచి యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో వంద మంది యువకులు బీఆర్ఎస్లో చేరగా, నాగోలు డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు బద్దం శ్రీధర్ గౌడ్, బద్దం నరేందర్ గౌడ్, కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ల ఆధ్వర్యంలో నాగోలు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సంక్షేమం, అబివృద్ధికి పట్టం కట్టాలన్నారు. మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, భాస్కర్ సాగర్, మల్లేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్, నవంబర్ 14 : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానంలేదని, ప్రజా సంక్షేమం, చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు భాస్కర్సాగర్ పాల్గొన్నారు.
డివిజన్లోని అన్మగల్ హయత్నగర్, ముదిరాజ్ కాలనీ, కమలానగర్, హైకోర్టు కాలనీ, ద్వారకామయినగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా కలిసి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎల్బీనగర్, నవంబర్ 14 : మాటలు చెప్పే నాయకులను నమ్మ వద్దని, నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేసే ప్రజా నాయకుడు దేవిరెడ్డి సుధీర్రెడ్డిని గెలిపించాలని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఛైర్పర్సన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సతీమణి దేవిరెడ్డి కమలారెడ్డి అన్నారు. మంగళవారం చైతన్యపురి డివిజన్లో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సతీమణి దేవిరెడ్డి కమలారెడ్డి ప్రారంభించిన అనంతరం జీపులో భారీ ర్యాలీతో డివిజన్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్యాదవ్, సీనియర్ నాయకులు సోంటి చంద్రశేఖర్రెడ్డి, తులసీదాస్, పవన్, సుదర్శన్రెడ్డి, వీరన్న, చిన్నాయాదవ్పాల్గొన్నారు.
ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.