ఎల్బీనగర్, డిసెంబర్ 14 : ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్గూడ జంక్షన్లో నూతనంగా నిర్మిస్తున్న లూప్లు, సెకండ్ లెవల్ ఫ్లైఓవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ జంక్షన్లో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా జరుగుతున్న లూప్లు, సెకండ్ లెవల్ ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోని ప్రభుత్వంలో ఎస్ఆర్డీపీ పనుల్లోని 47 ప్రాజెక్ట్ల్లో 36 ప్రాజెక్ట్లు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.
బైరామల్గూడ జంక్షన్లో లూప్ల నిర్మాణం ద్వారా ఎల్బీనగర్, చంపాపేట, సాగర్ రింగ్రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకు ఈ లూప్లు ఉపయోగపడుతాయన్నారు. ఔటర్ రింగ్రోడ్డు తరహాలో బైరామల్గూడ జంక్షన్లో లూప్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వాహనదారులకు బహుళ ప్రయోజనాలతో రూ.135 కోట్ల వ్యయంతో లూప్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ లూప్ల పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, ఎస్ఈ రవీందర్రెడ్డి, ఈఈ రోహిణి, డీఈ కార్తిక్, ఏఈ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.