కొండాపూర్, జనవరి 22: ప్రముఖ ఏఐ ఆధారిత ఇ డిస్కవరీ, రివ్యూ, రీసెర్చ్ ప్లాట్ఫారమ్ ప్రొవైడర్ సంస్థ ‘రివీల్’ తమ నూతన కార్యాలయాన్ని సోమవారం నగరంలోని నాలెడ్జ్ సిటీలో ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆసియా – పసిఫిక్లో తమ కార్యకలాపాలను కొనసాగించే దిశగా దేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభించినట్లు రివీల్ వ్యవస్థాపకులు, సీఈఓ వెండెల్ జిసా తెలిపారు. ఐటీ రంగానికి కేరాఫ్గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.