మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): రూ.2 కోట్లతో 60 లక్షల నిధులతో బృహత్ పల్లె పకృతి వనాలను అభివృద్ధి చేయనున్నారు. అటవీ విస్తీర్ణం పెంపులో భాగంగా ఎనిమిదెకరాల విస్తీర్ణంలో పల్లె పకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పకృతి వనాలను తీర్చిదిద్దుతున్నారు. ఘట్కేసర్ మండలం కాచివాని సింగారం, కీసర మండలం చిర్యాల్, మేడ్చల్ మండలం శ్రీరంగవరం, మూడు చింతలపల్లి మండలం జగన్గూడ, శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేట్లలో ప్రకృతి వనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి పల్లె పకృతి వనాలలో 15 వేల నుంచి 20 వేల మొక్కలు నాటనున్నారు. ఇప్పటి వరకు కాచివాని సింగారంలో 13 వేలు, చిర్యాల్ వెయ్యి, శ్రీరంగవరం 4 వేలు, జగన్గూడలో 6 వేల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. బొమ్మరాసిపేట పకృతి వనం ఏర్పాటుకు భూమిని చదను చేసి సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పకృతి వనాల అభివృద్ధికి ఈజీఎస్ నిధులను వెచ్చిస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు చేసిన పకృతి వనాలలో 15 వేల నుంచి 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.
నర్సరీల్లో మొక్కల పెంపకం..
పల్లె పకృతి వనాలలో మొక్కలు నాటేందకు జిల్లాలోని వివిధ నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. పెరిగిన మొక్కలను పల్లె పకృతి వనాలలో నాటుతున్నారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు పల్లె పకృతి వనాలను ఎనిమిదెకరాల నుంచి 10 ఎకరాలలో మొక్కలు నాటి దట్టమైన అటవీ ప్రాంతం తయారు చేయాలనేది.. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఉద్ధేశం. పల్లె పకృతి వనాలలో భూమి చదును అయిన చోట మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను గ్రామ పంచాయితీలకు అప్పగించించనున్నారు.