శామీర్పేట, జూన్ 23 : ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్ గ్రామాల్లో రూ.70 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు గురువారం భూమి పూజ చేశారు. పోతారం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మండలంలో మంజూరైన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో తండాలు, అనుబంధ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని, దీంతో పాటు నేడు శాశ్వత భవనాల కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత చదువులు చదువుకోవాలని 900 గురుకుల పాఠశాలలను ప్రారంభించారన్నారు. వచ్చే నెలలో రైతుబంధు, దళితబంధు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారికా మురళీ గౌడ్, వైస్ ఎంపీపీ సుజాత, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచులు కుమార్యాదవ్, విష్ణువర్ధన్రెడ్డి, మోహన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, రవి, ఆంజనేయులు, గోపీనాయక్, రాంచంద్రయ్య, నర్సింహా రెడ్డి, శిల్పాయాదగిరి, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి పాల్గొన్నారు.
వీర బ్రహ్మేంద్రస్వామి విగ్రహావిష్కరణ
ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించిన మహానీయుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అవుషాపూర్లో విశ్వ బ్రాహ్మణులు నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువారం స్వామి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. విగ్రహ దాత ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని మంత్రి అభినందించారు. సర్పంచ్ కావేరి మశ్చేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య యాదవ్, సహకార సంఘం డైరెక్టర్ పోచిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, విశ్వ బ్రాహ్మణులు ఆచారి, ఓంకార్ చారి, అంజయ్య, పాల్గొన్నారు.