బంజారాహిల్స్,ఆగస్టు 18 : ముంబైకి చెందిన మార్క్స్ మెన్ ఇండియా, న్యూస్-18 సంయుక్త ఆధ్వర్యంలో వివిద రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతియేటా ఇచ్చే ‘ది లీడర్స్ ఆఫ్ న్యూ ఇండియా’ అవార్డును జూబ్లీహిల్స్కు చెందిన సాహితీ గ్రూప్ చైర్మన్, సామాజిక వేత్త డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అందుకున్నారు. ముంబయిలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈమేరకు అవార్డును అందుకున్న డా. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కరోనా వేళ ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చడంతో పాటు ఫ్రంట్లైన్స్ వారియర్స్కు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు తదితర సామగ్రిని పంపిణీ చేయడంతో తనకు అవార్డు లభించిందన్నారు.