మేడ్చల్ /బోడుప్పల్, మే 22 : బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచర్ల ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వైద్యం చేరువ చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. బోడుప్పల్లోని ప్రతి డివిజన్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేడ్చల్లో జరిగిన కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ మర్రి దీపికానర్సింహ రెడ్డి, డీఎంఎహెచ్వో పుట్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాలకుర్తి భవానీ రాఘవేందర్ గౌడ్, వంగేటి లావణ్యహన్మంత రెడ్డి, మణికంఠ గౌడ్, బత్తుల శివకుమార్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, తుడుం గణేశ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ యాదవ్, కౌడె మహేశ్, కో ఆప్షన్ సభ్యుడు మహబూబ్ అలీ, కమిషనర్ త్రిల్లేశ్వర్రావు నాయకులు మర్రి నర్సింహ రెడ్డి, శేఖర్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, విష్ణుచారి, శ్రావణ్కుమార్ గుప్తా, రవీందర్, మధుకర్ యాదవ్, నడికొప్పు నాగరాజు, సాటే నరేందర్, హనుమంత రెడ్డి, డీఈఈ విజయలక్ష్మి, ఇన్చార్జి ఆర్వో రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్ జరిగిన కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవీంద్రబాబు స్థానిక కార్పొరేటర్లు చందర్గౌడ్,సుమన్ నాయక్, చీరాల నర్సింహ, మహేశ్వరి, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు కొత్త రవిగౌడ్, గోపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. కంటోన్మెంట్లో నాలుగు బస్తీ దవాఖానాలతో పాటు రెండు యూపీహెచ్సీలు మంజూరు కాగా అందులో రెండింటిని ప్రారంభించుకున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల్లో వైద్యసేవలు ఉచితమని, అన్ని పరీక్షలు చేస్తారని, ఎవరూ ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్