మేడ్చల్, జనవరి7(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ రాష్ట్రంలో ఉండడం వల్లే రాష్ర్టాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఇతర రాష్ర్టాల్లో సైతం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.
అధికారుల, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతున్నదని, దీనికి ప్రభుత్వం వందల కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. ప్రభుత్వం జిల్లాలోని గ్రామపంచాయతీల్లో హరితహారం, తాగు, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందించి గ్రామా ల అభివృద్ధికి కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.అన్నదాతకు అండగాపంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం, రైతు బీమా కింద రూ. 5 లక్షలు అం దజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మం జూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, నిధులకు ఎలాంటి కొరతలేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.
గతంలో గ్రామపంచాయతీల కంటే టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక వంద శాతం పంచాయతీల్లో అభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వల్లే మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో ముందు నిలిచిందన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై సంబంధిత అధికారులు, మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
-జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి
జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా అన్ని రంగాల్లో ముందునిలువడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో సభ్యులు అడిగిన వివరాలు, సందేహాలను జడ్పీ సీఈవో ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, జడ్పీ సీఈవో దేవసహాయం, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. మొట్టమొదటి సారిగా జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్రెడ్డిని సభ్యులతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఘనంగా సన్మానించారు.