సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు ప్రయాణికుల కోసం అమీర్పేట మెట్రో స్టేషన్లో మెట్రో ఫెస్ట్ను ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం.డి. కేవీబీ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మెట్రో ఫెస్ట్లో కళలు, సంస్కృతి, వినోదాలతో కూడిన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఉచిత మెహందీ కళ, శక్తివంతమైన ప్లీయా మార్కెట్, ఆకర్షణీయమైన ఫొటో బూత్ కార్నర్ వంటి అంశాలు ఇందులో ఉంటాయని కేవీబీ రెడ్డి తెలిపారు. అమీర్పేట మెట్రో స్టేషన్లో మధ్యాహ్నం 3 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ సీఓఓ సుధీర్ చిప్లుంకర్, ఎల్ అండ్ టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరద రాజన్ తదితరులు పాల్గొన్నారు.