కేపీహెచ్బీ కాలనీ, మార్చి 27 : ఆరోగ్యవంతులు జీవించడానికి ఓపెన్ జిమ్లు దోహదం చేస్తాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ ఎన్ఆర్ఎస్ కాలనీలో ఓపెన్ జిమ్ను, వాటర్ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలుచోట్ల ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయాన్నే నడకకు వెళ్లే వారికి, యువతకు ఓపెన్ జిమ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా, వాకింగ్ లాంటి వ్యాయామాలకు సమయాన్ని కేటాయించి ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు. అలాగే కాలనీలో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధితో పాటు అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్లో ప్రజా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జలమండలి జీఎం ప్రభాకర్, ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్, స్థానిక నేతలు సాయిబాబా చౌదరి, శ్యామలరాజు తదితరులున్నారు.
పురాతన కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బాలాజీనగర్లో డ్రైనేజీ సమస్యపై స్థానిక ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం జరుగుతుందని.. భవిష్యత్ అవసరాను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నట్లు తెలిపారు. బాలాజీనగర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు వెంటనే రోడ్డును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్ గౌడ్, ఆరోగ్యరెడ్డి, ఇంజినీరింగ్ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, జలమండలి జీఎం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.