KTR | రెండేళ్లుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసునని.. ఇబ్బందులు పోవాలంటే మన ప్రభుత్వమే రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్లోని హమాలీ బస్తిలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బొడ్రాయి పండుగను బస్తీ వాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హమాలీ బస్తీ వాసులు బీఆర్ఎస్ నేతలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలందరూ బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాట్లాడుతూ పల్లెటూర్లలో మాత్రమే నిర్వహించే బొడ్రాయి పండుగ ను హమాలీ బస్తీలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని.. బుద్ధి చెప్పాలి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే మీ బంధువులకు.. స్నేహితులకు నవంబర్ 11 నాడు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ లు హేమలత, టీ మహేశ్వరి, సునీత, బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, బస్తీవాసులు సత్యనారాయణ, సుభాష్, యాదగిరి, రవి, కుషాల్, వెంకటేశ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.