ముషీరాబాద్: దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మెచ్చిన గాయకుడు కిషోర్కుమార్ అని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు. మనీషా ఆర్ట్స్సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు కిశోర్కుమార్ 92వ జయంతిని పురస్కరించుకొని గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వేణగోపాలాచారి పలువురు గాయనీ, గాయకులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చక్కటి మధుర గీతాలతో కిషోర్కుమార్ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా గాయకులు మధుబాపూ శాస్త్రీ, అనుపమ కుమార్, అనీస్ హామ్మద్, అసిమ్, కళ్యాణిలు ఆలపించిన మధుర గీతాలు స్రోతలను అలరించాయి. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, ఏసీపీ రామదాసు, మహవీర్ తదితరులు పాల్గొన్నారు.