మైలార్దేవపల్లి, మే 22: రెండేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. వెంటనే విడిపిచిపెట్టిన ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం… మధుబన్కాలనీకి చెందిన శ్రీకాంత్ పాస్ట్ ఫుడ్ నిర్వహిస్తున్నాడు. వారం రోజులు కిందట అశోక్ (23) పాస్ట్ ఫుడ్ సెంటర్లో పనికి చేరాడు. శనివారం సాయంత్రం అశోక్ మద్యం మత్తులో రెండు సంవత్సరాల చిన్నారిని (బాలిక) ఎత్తుకొని పనిచేస్తున్న పాస్ట్ఫుడ్ సెంటర్కు వచ్చాడు. పాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని చిన్నారిని ఎక్కడినుంచి తీసుకువచ్చావో అక్కడే విడిచి పెట్టి రమ్మని మందలించాడు. దీంతో అశోక్ చిన్నారిని ఎత్తుకొని మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్ వద్దకు వెళ్లాడని సమాచారం రావడంతో శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కిడ్నాపర్ను ఎల్బీనగర్లో పట్టుకుని చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి క్షేమంగా ఉండటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ చేసిన అశోక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.