బంజారాహిల్స్, మార్చి 11: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కళ్లముందే కనిపిస్తున్నా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వ్యవహరించడం దారుణమని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిరాయించారు అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ, ఆయన మీద అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గోవర్ధన్రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు.
స్పీకర్ ప్రసాద్కుమార్కు జ్ఙానోదయం కలిగించాలంటూ బంజారాహిల్స్లోని జీవీకే చౌరస్తాలోని డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు తమ చెవిలో పూలు పెట్టుకుని, నల్లబ్యాడ్జీలతో దానం నాగేందర్కు, స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు.. రావుల విజయ్కుమార్, శ్రీనివాస్ నాయుడు, బిట్ల శ్రీనివాస్, నర్సింహ, గజ్జెల ఆనంద్, ప్రభాకర్రెడ్డి, శంకర్, శ్రీనివాస్, నిశాంత్ ముదిరాజ్, లడ్డూ, సాయి, సుజాత తదితరులు పాల్గొన్నారు.