బంజారాహిల్స్/హిమాయత్నగర్/ఖైరతాబాద్, నవంబర్ 9: హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్తో కలిసి గురువారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎన్బీటీనగర్లో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. 2014కంటే ముందు హైదరాబాద్ నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అనే విషయాన్ని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారన్నారు.
గతంలో కరెంట్ కష్టాలు, ట్రాఫిక్ కష్టాలతో నగరవాసులు ఎదుర్కొన్న సమస్యలను దూరం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బస్తీల్లో మంచినీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు 20వేల లీటర్ల దాకా ఉచితంగా అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్కు రికార్టు మెజార్టీతో విజయం సాధించి పెడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదలకు నిరంతం అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపిస్తే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టిస్తారన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎన్బీటీనగర్లో ఎన్బీటీనగర్లో పేద , మధ్యతరగతి ప్రజల ఇండ్లకు జీవో నంబర్ 58, 59 కింద క్రమబద్ధ్దీకరణ చేసి యాజమాన్య హక్కు కల్పించామని, మిగిలిన వారికి కూడా ఎన్నికలు పూర్తయ్యాక క్రమబద్ధ్దీకరణ చేయించే బాధ్యత తనదే అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్కు మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని బస్తీలు,కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, ఖైరతాబాద్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపించాలని హిమాయత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు చింటు అన్నారు. గురువారం దత్తానగర్లో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను పంపిణీ చేసి ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాము, రాజు,విజయ్,విశాల్,నవీన్,కిరణ్,దివాకర్ పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమాజిగూడ డివిజన్లోని పోచమ్మదేవాలయం వద్ద మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.