సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): జోస్ అలుక్కాస్ సరికొత్త ప్రీమియం డైమండ్ కలెక్షన్ ‘నిత్యారా’ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఆభరణాల కలెక్షన్ను దక్షిణ భారత సినీతార కీర్తి సురేశ్ శనివారం విడుదల చేశారు. ఆభరణాల తయారీలో ఆధునిక హంగులను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
వజ్రాలు, రత్నాలు.. నిపుణులైన డిజైనర్లు, ప్రావీణ్యం కలిగిన కళాకారుల ద్వారా రూపుదిద్దుకున్నట్లు యజమాన్యం తెలిపింది. కచ్చితమైన పనితనం, నాణ్యతతోపాటు ప్రత్యేక డిజైన్ కలిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు వర్ఘీస్ అలుక్కా, పాల్ జె అలుక్కా, జాన్ అలుక్కా పాల్గొన్నారు.