వనస్థలిపురం : తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశం గర్వించదగిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ బీఎన్రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరం నర్సింహ్మారావు, కొంగర మహేష్, రాఘవేందర్రావు, పోగుల రాంబాబు, గంగం రాజు, నిర్మలాదేవి, సువర్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రధాని కావాలి రామ్మోహన్గౌడ్
దేశానికి సరైన దశ, దిశ చూపే సమర్థ నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్ అన్నారు. గౌతమినగర్లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ పూర్తి స్థాయిలో విఫలమైన నేపథ్యంలో కేసీఆర్ సేవలు దేశానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మిప్రసన్న, ప్రశాంత్గౌడ్, పారంద స్వామి, రంజిత్కుమార్గౌడ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురంలో….
వనస్థలిపురం డబుల్ బెడ్రూం ప్రాంగణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్లు హాజరై కేక్ కట్చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంజయ్కుమార్, ఆనంద్రాజ్, అజయ్ యాదవ్, శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురంలో…
నందనవనంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేరెడ్డి ఉదయ్కుమార్లు హాజరై కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కాశీం, జానిమియా, ప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.