రవీంద్రభారతి : అన్నికులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మేరు కులస్తుల సంక్షేమానికి రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.
ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా రవీంద్రభారతిలో సోమవారం మేరు సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మేరు (టైలర్స్)డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి గంగుల కమలాకర్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావులు విచ్చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా అత్యధికంగా వెనుకబడ్డ మేరు కులస్థులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
మేరు కులస్తులు ఆత్మగౌరంతో జీవించేలా వారికి నగరంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం భూమి, నిధులు కేటాయించారని, త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా చేపడుతామన్నారు. మేరు కులస్థులకు కుట్టుమిషన్లు, డబుల్ బెడ్రూంలు,కళ్యాణలక్ష్మి పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు.
బీసీ కులస్థులు మంచిగా చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. బీసీ కులస్థుల పిల్లలు నాణ్యమైన చదువు అందించడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టారని ఆయన కొనియాడారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం నేతలు పొలిశెట్టి నర్సింగ్రావు,కె.భాస్కర్రావు,వెంకటేశ్వరరావు,ప్రభాకర్రావు, తదితరులు పాల్గొన్నారు.