సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అకౌంట్ టేకోవర్ చేసి నగర వ్యాపారానికి సైబర్నేరగాళ్లు రూ. 1.19 కోట్లు టోకరా వేశారు. ఒక్క అక్షరం తేడాతో నకిలీ ఈ మెయిల్తో దోచుకున్నారు. అమీర్పేట్లోని దివ్యశక్తి కంప్లెక్స్లో ఎస్ఏఎంకేఆర్జీ పిస్టిన్స్ అండ్ రింగ్స్ పేరుతో కరుణాకర్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ముడిపదార్థాలను చైనాలోని మ్యాన్కాంగ్ డింగ్జాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ నుంచి తెప్పిస్తుంటాడు. ఇటీవల ఆ కంపెనీకి ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పంపించాడు. సదరు కంపెనీ తమకు రూ. 1.19 కోట్లు పంపిస్తే సరుకు డెలివరీ చేస్తామంటూ ఇన్వాస్ పంపించింది.
నాలుగైదు రోజుల వ్యవధిలోనే కరుణాకర్ సంస్థకు మరో ఈ మెయిల్ వచ్చింది. మరో అకౌంట్కు ఆ మొత్తాన్ని పంపించాలంటూ అందులో ఉంది. డబ్బులు పంపినా సరుకు ఇంకా రాకపోవడంతో చైనా కంపెనీకి ఫోన్ చేయగా, విషయం తెలిసింది. ఈ మెయిల్స్ను పరిశీలించగా, ఒరిజినల్ కంపెనీ మాదిరిగానే అకౌంట్ టేకోవర్తో వచ్చిన మెయిల్కు స్పందించడంతో ఈ మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు .. శుక్రవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.