జూబ్లీహిల్స్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డి, బాబాఫసియుద్దీన్, దేదీప్య విజయ్, సంగీతా యాదవ్లతో కలిసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూసుఫ్గూడలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారని, దేశంలో ఏ సీఎం చేయని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పేద ప్రజల, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని కొనియాడారు. అన్ని డివిజన్లనుంచి టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వేడుకలలో పాల్గొన్నారు.