హైదరాబాద్: కార్తీక దీపం సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు(పరిటాల నిరుపమ్) గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నాడు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిరుపమ్ జూబ్లీహిల్స్లో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటాడు.
ఈసందర్భంగా మాట్లాడిన నిరుపమ్.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణానికి మొక్కలు ఎంతో మేలు చేస్తాయన్నారు. తన వంతుగా ఈ రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటానని తెలిపారు. ఈ సందర్భంగా తన సహనటులు ప్రీతమ్, అమర్ దీప్ చౌదరి, మానస.. ఈ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ను నిరుపమ్ విసిరారు.