బేగంపేట్, జనవరి 17: కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు-2 కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… వంద రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగుకు ప్రభుత్వం 250 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎవరు కూడా కంటి చూపు సమస్యతో బాధ పడకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు,మీమీ బస్తీలు, కాలనీల్లో నివసించే ప్రజలు కంటి వెలుగు శిబిరాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకొనే విధంగా చూడాలని కోరారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు కూడా ఉచితంగా అందజేస్తారని అన్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి ప్రభుత్వమే ఉచితంగా చేసేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. సంగారెడ్డిలో ఆకృతి సంస్థ తయారు చేసిన ఎంతో నాణ్యత కలిగిన కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తారని, ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ వెంకట్, కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్రెడ్డి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, ఉప్పల తరుణి, ఎస్పీహెచ్వోలు రాజశ్రీ, రేవతి పాల్గొన్నారు.
కంటి వెలుగు పరీక్షల ట్రయల్న్
మేడ్చల్, జనవరి17 (నమస్తే తెలంగాణ): రెండో విడుత కంటి వెలుగు పరీక్షల నిర్వహణపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా వైద్యశాఖ ట్రయల్న్ నిర్వహించింది. ఈ నెల 19 నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ముందస్తుగా ట్రయల్న్ నిర్వహిస్తూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ కంటి వెలుగు పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ట్రయల్న్ల్రో మందులు, యంత్రాల పనితీరు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది లభ్యత పై పరిశీలించారు. జిల్లాలో 27,51,810 మందికి కంటి పరీక్షలను చేసే లక్ష్యంగా 418 క్యాంపులు, 79 బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రయల్న్ల్రో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, జనవరి 17 : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం పై జిల్లా వైద్యాధికారి బి.వెంకటేశ్వరరావు, వైద్యుల బృందంతో జిల్లెలగూడలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 19 న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో, కార్పొరేషన్ డివిజన్లలో కంటి పరీక్షల క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తారని చెప్పారు. వైద్యశాఖ అధికారులు పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.