రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఈనెల 18 నుంచి వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల దాకా కంటి పరీక్షలు చేయనుండగా ఏ రోజు ఎక్కడ క్యాంపు ఉంటుందో ఆయా ప్రాంతాల వారికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు.
బడంగ్పేట/ఆర్కేపురం, జనవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం చిత్రలేఅవుట్ కాలనీలో బీఆర్ఎస్ డివిజన్ పార్టీ కార్యాలయంలో, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలకు అందుబాటులో కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కంటి సమస్యలు ఉన్నవారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కండ్ల అద్దాలు ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈనెల19 నుంచి 100 రోజుల పాటు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, ప్రభుత్వం పేద ప్రజల కోసం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నారని చెప్పారు. ప్రతి కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అందుబాటులో ఉండి అక్కడికి వచ్చే ప్రజలకు వైద్య పరీక్షలు చేయించి అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఇప్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. అదే విధంగా ప్రతి అదివారం ఒక కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ కృష్ణ మోహన్రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, నాయకులు భూపేశ్గౌడ్, శ్రీనూనాయక్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సిద్దగోని వెంకటేశ్గౌడ్, నాయకులు కొండ్ర శ్రీనివాస్, ఎంఏ సాజీద్, దుబ్బాక శేఖర్, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, పాషా, అల్లావుద్దీన్ పటేల్, శ్యామ్ గుప్తా, శ్రీరాములు, వేణు, అనురాధ, బుజ్జిబాయి, తదితరులు పాల్గొన్నారు.