గోల్నాక : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంలా మారాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాసగౌడ్, ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి, వై.అమృత తదితరులతో కలసి 127 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ది దారులకు మంజూరైన రూ.1కోటి27లక్షల14వేల విలువగల చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదింటి ఆడపడుచుల పెండ్లిండ్లకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారాడన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు అశ్విన్, బీవీ.మహేష్రాజు, బద్రినాథ్, రాముతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.