సైదాబాద్ : సైదాబాద్ మండల కార్యాలయం వద్ద శనివారం కల్యాణ లక్ష్మి చెక్కులను యాకుత్పురా నియోజకవర్గం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరంలాంటిదని, పేదప్రజలు తమ ఆడపిల్లల పెండ్లిలు చేయటానికి ఎంతగానో ఉపయోగడుతుందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.