బంజారాహిల్స్,నవంబర్ 24: తెలంగాణ రాష్టాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంతో పాటు అభివృద్ధి ఫలాలను పేదలకు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీనగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంజారాహిల్స్ డివిజన్కు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంయుక్తంగా కలిసి చెక్కులను పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలో ఇటీవల మంజూరైన 32 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం మేయర్ మాట్లాడుతూ..పేదల అవసరాలు, కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తీర్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి. షాదీముబారక్ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వారికి ఉపయోపడేలా అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు నేరుగా మహిళల పేరుతోనే నడుస్తున్నాయని, మహిళలకు సోదరుడిలా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్పేట మండల తహసీల్దార్ రామకృష్ణనాయక్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.