గౌతంనగర్, డిసెంబర్ 22 : బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ అన్నారు. గురువారం గౌతంనగర్ డివిజన్, సాయినగర్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహకారంతో 1500గిఫ్ట్ ప్యాక్లను 35మంది చర్చి పాస్టర్లకు ఆమె అందజేసి.. క్రిస్మస్ సుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో గెలిపించాలని కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, సీవో వెంకన్న, చర్చి పాస్టర్లు ఆనంద్కుమార్, శ్రీనివాస్, సుదర్శన్, బక్క ఏలియా, వినోద్కుమార్, ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.