హైదరాబాద్ : విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్హ్యండెడ్గా చిక్కాడు. పూర్తి వివరాలు.. హైదరాబాద్ హబ్సిగూడలోని టీఎస్ఎస్పీడీసీఎల్(TSSPDCL)లో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న సామ విజయసింహ రెడ్డి(Vijaya Narasimha reddy) అనే ఉద్యోగి రూ. 35,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
అదేశాఖలో ఆర్టిజన్గా పనిచేసిన భరత్ తనకు రావాలసిన బకాయిల కోసం జూనియర్ అకౌంటెంట్ను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు హబ్సిగూడ కార్యాలయంపై దాడి చేసి లంచం(Bribe) తీసుకుంటుండగా ఏవోను పట్టుకున్నారు.
ఏవో వద్ద నుంచి రూ.35 వేలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేసి నాంపల్లి(Nampalli) ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.