HomeHyderabadJubilee Hills Mla Maganti Gopinath That The Development Took Place Only During The Rule Of Chief Minister Kcr
సంక్షేమ పాలన బీఆర్ఎస్తోనే సాధ్యం
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
వెంగళరావునగర్, నవంబర్ 10 : రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ది జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్లోని మధురానగర్ బి బ్లాక్ కాలనీవాసులు నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు ఎమ్మెల్యే మాగంటి హాజరై మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరించాన న్నారు. కాలనీ అభివృద్దికి ఎంతో సహకారం అందించామన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు, నాగార్జునరెడ్డి, కాలనీవాసులు ఎన్.మనోహర్రావు,కమలారావు, సదాశివరెడ్డి, వెంకటేశ్వరరావు, రవీంద్ర,కోడే సాంబశివరావు, గంగారెడ్డి, సత్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.
కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు
బంజారాహిల్స్ : బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పిలపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో రహ్మత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. నామినేష న్కు ముందుగానే ఒక రౌండ్ ప్రచారం పూర్తిచేశామని, ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్కు మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. నియోజకవర్గంలో 70శాతం ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్ సీఎన్ రెడ్డితోపాటు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురు యువకుల చేరిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ ఫేజ్-2కు చెందిన పలువురు యువకులు స్థానిక బీఆర్ఎస్ నేత రమేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధించడంతో పాటు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, యువత ఈ విషయాన్ని గమనించి ఓటు వేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో ఏసురత్నం, రమేశ్ తదితరులు ఉన్నారు.
మాగంటి గోపినాథ్ను గెలిపించాలి
జూబ్లీహిల్స్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపినాథ్ను గెలిపించాలని యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం మాగంటి గోపినాథ్కు మద్దతుగా యూసుఫ్గూడలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, నర్సింగ్దాస్, నాయకులు ఆదిలక్ష్మి, గీతా గౌడ్, నిర్మల, అరుణ, మాధవీలత, రమాదేవి, సరోజిని, సాయిలక్ష్మి, నాగరాణి, శ్రీనివాస్, బాబి, శరత్, ధర్మారావు, ఆదిల్, నవీన్, వెజ్లర్ సాయి, సోల్లంకి, సాయితేజ పాల్గొన్నారు.