ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు
జోన్ బృందం ఏప్రిల్ 2: శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సీఎన్. రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉగాది పచ్చడి ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో యూసుఫ్గూడ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ముదిరాజ్. శ్రీను. కల్యాణి. గీతాగౌడ్, అరుణ, స్రవంతి , వెంగళ్రావునగర్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వేణు, శ్యామ్ ముదిరాజ్, సత్యనారాయణ, పవన్ రహ్మత్నగర్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, రవిశంకర్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ కానుకలు అందజేయడం అభినందనీయం
జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ,ఏప్రిల్2: వ్యక్తిగతంగా రంజాన్ కానుకలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషి ఏర్పాటు చేసిన ‘రంజాన్ తోఫా’ కానుకలను 600 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, పల్లవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రహ్మత్నగర్లో ఎమ్మెల్యే పర్యటన
జూబ్లీహిల్స్,ఏప్రిల్2: ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత నివ్వనున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహ్మత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలతో పాటు బస్తీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.