హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 10.2 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం వరకు సమయం ఉండటంతో మందకోడిగా పోలింగ్ కొనసాగుతున్నది.
















