చార్మినార్, ఏప్రిల్ 17: నమ్మకమే వ్యాపారంలో కీలకమని, వినియోగదారులను ఆకర్షించడానికి నమ్మకమైన వస్తువులే ప్రామాణికంగా నిలుస్తాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన జోయలుక్కాస్ షోరూంను సోమవారం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్, జోయలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జోయలుక్కాస్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ జోయలుక్కాస్ నాణ్యమైన ఉత్తమ ఆభరణాలను అందిస్తుందన్నారు. కాగా, షోరూంను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు.