హైదరాబాద్, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ జర్నలిస్టు భోగాది వెంకట రాయుడు తన నలభై ఏండ్ల జర్నలిజం అనుభవాలపై రచించిన ‘రాస్తూనే ఉందాం’ పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు కర దీపికగా ఉపయోగపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి) ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి శాంతా బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్రెడ్డి హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు , అస్కి చైర్మన్, పద్మభూషన్ కె.పద్మనాభయ్య, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జర్నలిస్టు సంఘాల నాయకులు హనుమంతరావు, శ్రీనివాస్రెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.