దుండిగల్/కుత్బుల్లాపూర్, అక్టోబర్ 20: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో యువతరం విసుగెత్తిందని, బంగారు తెలంగాణ దిశగా సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్శితులై యువతరం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షులు, వేంకటేశ్వరస్వామి అష్టలక్ష్మి ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో టూ వీలర్ మెకానిక్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రగతినగర్ నాయీబ్రహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రమేశ్ ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. ఎన్ఎంసీ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ సలీం ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి మైనార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. జగద్గిరిగుట్ట డివిజన్ వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ వేణుయాదవ్ ఆధ్వర్యంలో మగ్దూంనగర్ నివాసి గణేశ్ మిత్ర బృందం, సోమయ్యనగర్ విజ్ఞాన వినాయక యూత్ అసోషియేషన్, జై శ్రీరామ్ యూత్, పొలాల బస్తీలోని శివాజీ యూత్, జైమాత యూత్ అసోషియేషన్ల నుంచి సుమారు 500మంది యువకులు ఎమ్మెల్యే నివాసం వద్ద బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న కార్యకర్తలను, యువకులను కంటికిరెప్పలా కాపాడుకుంటానని, భవిష్యత్లో వారి అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ ఉత్సాహం చేస్తుంటే రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీలో హ్యాట్రిక్ ఖాయమనిపిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజ్యాదవ్, ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్ రాఘవేంద్రరావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.