హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) లో ఆగస్టు 1వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. దక్కన్ బ్లాస్టర్స్ సహకారంతో MANUU క్యాంపస్లో 1వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో 40 కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో ఐటీతో పాటు ఇతర కంపెనీలు ఉండనున్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి 10 సెట్ల బయోడేటాను తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. తదితర వివరాల కోసం 9848171044, 8374315052 నంబర్లను సంప్రదించొచ్చు.