సుల్తాన్బజార్,సెప్టెంబర్ 7 : నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాధిని కల్పించేందుకు గాను ఈ నెల 9న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాల భర్తీకి జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటి, ఐటీఈఎస్, ఫార్మా,హెచ్పీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అకౌంట్స్, మ్యానుప్యాక్చరింగ్, మార్కెటింగ్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళాను నిర్వ హిస్తున్నట్లు ఆమె వివరించారు.
ఈ జాబ్మేళాలో ఓజాస్ ఇన్నోవేటివ్, టెక్నాలజీస్, విర్టస్ ఐటీ ఇండియా, వేగారియస్ సొల్యూషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్, బిగ్ సి, కార్వీ, జియో మార్ట్, స్విగ్గీ, అపోలో ఫార్మసీ, స్చైండర్ ఎలక్ట్రిక్, జేఎస్ఆర్ గ్రూప్ తదితర సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి భ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు .18 ఏండ్లు నుంచి 35 ఏండ్ల వయస్సు కలిగిన పదో తరగతి, ఇంట ర్మీడియట్, డిప్లోమా, బీ టెక్, ఎంటెక్, గ్రాడ్యుయేట్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు.
1500 పోస్టులకు జరిగే ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వడం జరుగుతుం దన్నారు. ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు ఈ నెల 9న హబ్సిగూడలోని ఓమేగా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్మేళాలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కోసం 8309877 396 నెంబర్లో సంప్రదించాలని అన్నారు.