దుండిగల్, జూన్ 18: బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కృష్ణాజిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన చెన్నుపాటి గాంధీ బొల్లారంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు ఈ నెల 8న సికింద్రాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్లో బస్సు దిగాడు.
తొందరలో నగల బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు. మారేడ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఆ బ్యాగును తీసుకొని చింతల్లో దిగినట్లు గుర్తించారు. జీడిమెట్ల స్టేషన్కు కేసు బదిలీ చేశారు. నిందితుడు తెనాలి మండలం, నందివెలుగు గ్రామానికి చెందిన నంద రాజశేఖర్ (38) సుచిత్రలో ఉంటున్నట్లు తెలుసుకొని పట్టుకున్నారు.